Homeతెలుగు Newsజగన్‌, పవన్‌.. మోడీ చెప్పినట్లు వింటున్నారు

జగన్‌, పవన్‌.. మోడీ చెప్పినట్లు వింటున్నారు

అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న సీఎం… అక్కడి నుంచి హెలికాప్టర్లో గుమ్మఘట్ట మండలానికి చేరుకున్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి బీటీ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరించారు. ఆ తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష నీటి కుంటలు జిల్లాలో పూర్తైన సందర్భంగా లక్షవ నీటి కుంటను సందర్శించారు.

8 7

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాను కరవు నుంచి దూరం చేసేందుకు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే లక్ష నీటి కుంటలు పూర్తి చేయడం, 5లక్షల ఎకరాలకు బిందు, తుంపర సేద్య పరికరాలు అందించామని చెప్పారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలోకి తీసుకురావాలని తాము ఎంతో కృషి చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని నిలదీసే తాము ఎన్డీయే నుంచి వైదొలిగామని… అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల్లో అభివృద్ధి నిమిత్తం విడుదల చేసిన నిధులను సైతం కేంద్రం వెనక్కి తీసుకుందని.. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు.

ప్రతిపక్ష పార్టీ నేతలకు కేసుల నుంచి బయటపడటంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదని చంద్రబాబు విమర్శించారు. ఎవరు అధికారంలో ఉంటే వారి కాళ్లు పట్టుకోవడం వారికి అలవాటేన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని, కేంద్రాన్ని విమర్శించడం మానేసి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మోడీ పేరెత్తితేనే వైసీపీ నేతలకు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ఉప ఎన్నికలు రాకుండా అన్నీ ఆలోచించిన తర్వాతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రెండు మూడు పార్టీలకు అభివృద్ధిని అడ్డుకోవడమే అలవాటుగా మారిందన్నారు. గత ఎన్నికల్లో తమకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు మోడీ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని ఆరోపించారు. జనసేన ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ వేసిన పవన్‌.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాలని తేల్చారని.. కానీ అప్పుడు ఆ నివేదిక ఊసే ఎత్తడం లేదన్నారు. రాజకీయాల్లో విలువలు, పద్ధతి ఉండాలని.. అధికారం ఉంది కదాని తప్పుడు పనులు చేయడం సరికాదన్నారు.

తాము బీజేపీతో విభేదించక ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని టీఆర్‌ఎస్‌ నేతలు కూడా డిమాండ్‌ చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. ఎప్పుడైతే టీడీసీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందో అక్కడి నుంచి బీజీపీ నేతలు రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మోడీ కంటే సీనియర్‌ రాజకీయ నేతని అయిన తనను పట్టుకుని మెచ్యురిటీ లేదని ఆయన పార్లమెంటులో మాట్లాడటం ఏంటని? ప్రశ్నించారు. ఓ దశలో బీజేపీ దేశవ్యాప్తంగా రెండు సీట్లకే పరిమితమైన సమయంలో.. ఎన్టీఆర్‌ హయాంలోని టీడీపీ 35 సీట్లతో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిందని.. తమ పార్టీ సత్తా అలాంటిదని గుర్తుచేశారు. ప్రపంచంలో తెలుగుజాతి ఎక్కడున్నా టీడీపీ ఆదుకుంటుందన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మహాకూటమిలో చేరితే అందుకు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu