HomeTelugu Newsరైతు దినోత్సవంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

రైతు దినోత్సవంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

10 6ముఖ్యమంత్రి జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యం తెస్తామని చెప్పి రైతు వ్యతిరేక రాజ్యం తెచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం రైతు దినోత్సవం జరపడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. విత్తనాలు అడిగితే లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్లలో విత్తనాల పంపిణీ.. వాళ్ల నిర్వాకాలతో మళ్లీ పాత రోజులు గుర్తు చేశారన్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతులను రోడ్డెక్కించారని ఎద్దేవా చేశారు. విత్తనాల తయారీ అంటే ఉప్మా, ఇడ్లీ తయారు చేసినట్లు కాదని సంబంధిత శాఖ మంత్రే అనడం వ్యవసాయం, రైతుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. పోలవరం పనులపై దుష్ప్రచారం చేయడం రైతాంగ వ్యతిరేకమేనన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయడం రాష్ట్ర రైతాంగానికే నష్టదాయకమని విమర్శించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu