HomeTelugu Newsఅలా చేస్తే.. నేను రాజకీయాలే వదిలేస్తా: చంద్రబాబు

అలా చేస్తే.. నేను రాజకీయాలే వదిలేస్తా: చంద్రబాబు

4 11

టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్రానికి ఒకటే రాజధాని.. అది అమరావతే అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించినపుడు ప్రజలంతా ఒప్పుకున్నారని చెప్పారు. అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా పెనుకొండలో చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లాకు కియా మోటార్స్‌ తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి బాధపడ్డారని.. మూడు రాజధానులు తమకే లాభమంటూ తెలంగాణకు చెందిన ఓ మంత్రి వ్యాఖ్యానించారని చంద్రబాబు గుర్తు చేశారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ఇస్తామని చెప్పింది తానేనన్నారు. ఇప్పుడు హైకోర్టును కూడా 3 ముక్కలు చేస్తామని చెబుతున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. తాను కష్టపడేది భావితరాల కోసమేనని ఆయన చెప్పారు.

”రాయలసీమ నుంచి విశాఖకు వెళ్లాలంటే రాత్రంతా ప్రయాణించాలి. అక్కడికి వెళ్లేందుకు రెండు రోజులు.. వచ్చేందుకు రెండు రోజులు పడుతుంది. రాజధాని అమరావతిని మార్చాలనుకుంటే వైసీపీకు చెందిన 151 మంది ఎమ్మెల్యేలూ రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. ఎన్నికల్లో ప్రజలు వైసీపీకు అనుకూలంగా తీర్పు ఇస్తే రాజధాని విశాఖకు మార్చుకోండి.. వైసీపీ గెలిస్తే నేను రాజకీయాలే వదిలేస్తా. ఈ సీఎం దీనికి ఎలాగూ ఒప్పుకోరు. రాజధానిపై ఓటింగ్‌ నిర్వహించి అమరావతా? విశాఖ? అన్నది తేల్చాలి” అని ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్‌ విసిరారు. జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీ రిపోర్టులు బోగస్‌ రిపోర్టులని.. వాటిని భోగి మంటల్లో వేసి చలికాచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu