HomeTelugu Trendingకేసీఆర్‌ని కలిసిన చిరంజీవి, నాగార్జున

కేసీఆర్‌ని కలిసిన చిరంజీవి, నాగార్జున

Chiranjeevi and nagarjuna m
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును టాలీవుడ్‌ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున కలిశారు. ప్రగతి భవన్‌లో ఈ భేటీలో ఎంపీ సంతోష్‌ కుమార్‌ కూడా ఉన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రకటించిన విరాళాలకు సంబంధించిన చెక్కులను సీఎం కేసీఆర్‌కు అందజేశారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ అతలాకులతం అయిన విషయం తెలిసిందే. వరద భాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్‌ ప్రముఖులంతా ముందుకు వచ్చారు. తెలంగాణలో వరద నష్టానికి సాయంగా చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ.50 లక్షలను ప్రకటించారు. వీరితో పాటు టాలీవుడ్‌ నుండి సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, యంగ్‌ రెబల్‌ ప్రభాస్‌ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి చెరో కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!