HomeTelugu Trendingజైపాల్‌రెడ్డి మృతికి చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ సంతాపం

జైపాల్‌రెడ్డి మృతికి చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ సంతాపం

7 26కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి మృతి పట్ల ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి తనదైన ముద్రవేశారని, ఆయన మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు అని చిరంజీవి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాజనీతిజ్ఞుడు జైపాల్‌ మరణం దేశానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని పవన్‌ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగుతో పాటు, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం వల్ల చట్ట సభల్లో ఆయన ప్రసంగాలు సభ్యులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేవని, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు గెలుపొందడం కీర్తించదగిన విషయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, నేటి తరం రాజకీయ వేత్తలకు, యువకులకు ఆదర్శప్రాయమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు పవన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu