HomeTelugu Trendingఆవిడ మా అమ్మ కాదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

ఆవిడ మా అమ్మ కాదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

8 10
టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా కరోనాపై యుద్ధంలో తాను సైతం అంటూ ముందుకొచ్చారని. ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టారని వార్తలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా చిరంజీవి స్పందించారు. ఆ కథనాల్లో ఉన్నది తన తల్లి కాదని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ” మీడియా అంటే నాకు చాలా గౌరవం కానీ మా అమ్మగారు మాస్క్‌లు తయారుచేస్తున్నారనే వార్తలు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం చూశాను. ఆ మీడియా కథనంలో ఉన్నది మా అమ్మగారు కాదని వినయంగా తెలియజేస్తున్నాను. కానీ ఎవరైతే ఈ కథనంలో ఉన్నారో ఆ తల్లికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే..” అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu