మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం స్నికితతో రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరిగింది. సోమవారం తెల్లవారుఝామున ఘనంగా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ లో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులతో పాటు సన్నిహితులు కూడా సందడి చేశారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశ్వీరదించారు.
ఇక ఈ కార్యక్రమంలో ఏపి మంత్రి పేర్ని నానితో పాటు, అరకు ఎం.పి.మాధవి, రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో MD చలమల శెట్టి గోపి, AMR గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.