మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘రియల్ మ్యాన్ ఛాలెంజ్’ని స్వీకరించారు. ఆయన ఈ రోజు వ్యాక్యూమ్ క్లీనర్ తో ఇల్లు క్లీన్ చేసి, తనకు అత్యంత ఇష్టమైన దోశలు వేశారు. అయితే అందరి లాగే ఆయన కూడా చేస్తే మెగాస్టార్ ఎలా అవుతారు. ఆయన వేసిన దోశను తన తల్లికి వఢ్ఢించారు. అంతే కాక పక్కన కూర్చుని తల్లి చేత గోరు ముద్దలు తింటూ.. ఆమె తింటుంటే చాలా సంబరపడిపోయాడు మన మెగాస్టార్.అనంతరం మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఛాలెంజ్ ను విసిరారు. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న టాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ కొత్త ఛాలెంజ్ని సృష్టించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రియల్ మ్యాన్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతుంది. కాగా ఇప్పటికే ఈ ఛాలెంజ్ను రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, సుకుమార్ లు పూర్తి చేశారు. ఎన్టీఆర్ ఇటీవలే ఈ ఛాలెంజ్ లో పాల్గొని మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తదితరులకు ఛాలెంజ్ ను విసిరాడు.
Here it is Bheem @tarak9999 నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం. And I now nominate @KTRTRS & my friend @rajinikanth #BeTheRealMan challenge. pic.twitter.com/y6DCQfWMMm
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2020