HomeTelugu Newsకరోనాతో మరణించిన వారికి రూ. కోటి సహాయం

కరోనాతో మరణించిన వారికి రూ. కోటి సహాయం

10
కరోనా మహమ్మారి విస్తరించకుండా కొందరు, కరోనా బారిన పడినవారిని తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలు అందించేవారు కొందరు… కొందరు వైద్యులు కూడా ఈ మాయదారి వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. అయితే వారి కుటుంబాలకు అండగా తాము వున్నాం అంటూ భరోసా కల్పించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కరోనా వైరస్ సోకిన వారికి వైద్య సహాయం చేస్తూ మరణించిన వారికి ఆర్థిక సహాయం ప్రకటించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వారికి వైద్య సహాయం అందిస్తూ మరణించిన వారికి కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇక, వైద్యులతో పాటు నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ జాబితా కిందికి వస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇది కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేవారికి మాత్రమే కాదు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసేవారికి కూడా ఇది వర్తింపజేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu