HomeTelugu Big Storiesఏపీలో మరో 33 కరోనా కేసులు

ఏపీలో మరో 33 కరోనా కేసులు

5 11
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 33 కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2051కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు 10, కర్నూలు, నెల్లూరులో 9 చొప్పున, కృష్ణా జిల్లాలో 4, తూ.గో జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 10,730 శాంపిల్స్ పరీక్షించగా 33 మందికి పాజిటివ్‌గా తేలినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 58 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయ్యినవారి సంఖ్య 1056కి చేరింది. ఇప్పటివరకు ఏపీలో కరోనాబారినపడి 46 మంది ప్రాణాలు కోల్పోయారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu