తెలంగాణలో 404 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కి చేరింది. మంగళవారం సాయంత్రం తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ కొత్తగా 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకు తెలంగాణలో 11 మంది మృతి చెందారని బులెటిన్లో తెలిపింది తెలంగాణాలో కరోనా బారిన పడి చికిత్సపొందుతూ 45 మంది కోలుకున్నారని వారిని డిశ్చార్జి చేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 348 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో మొత్తం 171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 21 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. హైదరాబాద్ లో 150 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.