HomeTelugu Newsపీవీ సింధుకు మెగాస్టార్‌ సత్కారం.. వీడియో వైరల్‌

పీవీ సింధుకు మెగాస్టార్‌ సత్కారం.. వీడియో వైరల్‌

chiranjeevi congratulates p
ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించి దేశ చరిత్రలో సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ వీపీ సింధును మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సింధును ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఇటీవల ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జునతో పాటు సీనియర్ హీరోయిన్‌ రాధిక, సుహాసిని సహా చిరంజీవి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు.

ఈ సందర్భంగా సింధు సాధించిన విజయాలను చిరు కొనియాడారు. సింధును చూసి దేశం మురిసిపోతుంటే తన బిడ్డే అనే భావన కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవి కుటుంబం తనపై చూపించిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటానన్న సింధు. వచ్చే ఒలింపిక్స్‌లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. సింధు సాధించిన కాంస్య పతకంతో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ సందడిగా గడిపారు. అమ్మవారి విగ్రహాన్ని బహుకరించి సింధు ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా మెగా అభిమానులతో పంచుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu