HomeTelugu Trendingవెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ప్రముఖ దర్శకుడు

వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ప్రముఖ దర్శకుడు

7 18

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ లాక్ డౌన్ సమయంలో ”కార్తీక్ డయిల్ సయిద ఎన్” అనే షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఈ షార్ట్ ఫిలిమ్‌లో త్రిష, శింబు నటించారు. ఎవరింట్లో వారు ఉండి షూట్ చేసిన ఈ షార్ట్ ఫిలిమ్‌కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కాగా ఇప్పుడు ఈ దర్శకుడు ఓ వెబ్ సిరీస్ చెయ్యాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్‌. స్టోరీ విషయంలో ఇటీవల చర్చలు జరగగా, అమెజాన్ వారికి నచ్చడంతో వెబ్ సిరీస్‌ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఈ వెబ్ సిరీస్‌కి పని చేయనున్నారు. లాక్‌డౌన్ ముసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. గౌతమ్ మీనన్ తీసే ఈ వెబ్ సిరీస్‌ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!