HomeTelugu Trendingగోపీచంద్‌ మలినేని- రవితేజ నాలుగో సినిమా షురూ

గోపీచంద్‌ మలినేని- రవితేజ నాలుగో సినిమా షురూ

Gopichand Malineni Ravi Tej 1

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. చివరిగా వచ్చిన క్రాక్ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత గోపీచంద్ మలినేని మైత్రీ మూవీ మేకర్స్ లో బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా చేశారు. ఈ సినిమా హిట్ అయ్యింది.

ఇప్పుడు మైత్రీ నిర్మాణంలోనే గోపీచంద్ హీరోగా నాలుగో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారు. ఈ మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. మాస్ మహారాజ్ రవితేజ ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. రవితేజ, సెల్వ రాఘవన్, యాక్టర్ ఇందుజా మీద ఓపెనింగ్ షాట్ షూట్ చేశారు.

వివి వినాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని క్లాప్ కొట్టారు. కె రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అల్లు అరవింద్ నిర్మాతలకి స్క్రిప్ట్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. క్రాక్ తరహాలోనే రియల్ సంఘటన స్ఫూర్తితో ఈ చిత్రం కూడా తెరకెక్కనుంది.

ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు సెల్వ రాఘవన్ యాక్టర్ గా తెలుగులో చేస్తోన్న మొదటి సినిమా ఇదే. నవీన్ నూలి ఈ సినిమాకి ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్, జీకె విష్ణు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ఎలాంటి పాత్ర చేస్తున్నాడు అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. గోపీచంద్, రవితేజ కలయికలో నాలుగో మూవీగా వస్తోన్న ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu