మలయాళంలో వినూత్న కథాతో తెరక్కెక్కిన చిత్రం’అయ్యప్పనుమ్ కోషియం’!. ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులో రీమేక్ చేయడానికి గత కొన్ని రోజులగా సన్నాహాలు జరుగుతున్నాయి.సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకుని పనులు ప్రారంభించింది. ఈ క్రమంలో, మలయాళంలో ప్రధాన పాత్ర పోషించిన బిజూ మీనన్ పాత్రలో బాలకృష్ణ చేత నటింపజేయాలని నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ ఆయన దీనిని తిరస్కరించినట్టు తెలుస్తుంది. దాంతో ఆ పాత్రకు రవితేజను తీసుకోవాలని భావించిన నిర్మాతలు ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇదిలావుంటే.. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇప్పటివరకు తేలియలేదు. తాజా సమాచారం ప్రకారం, డైరెక్టర్ హరీశ్ శంకర్ ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో ప్రస్తుతం ఆయనతో నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారట. వాస్తవానికి పవన్ కల్యాణ్ తో హరీశ్ తన తదుపరి చిత్రాన్ని చేయాల్సి వుంది. అయితే, లాక్డౌన్ కారణంగా పవన్ చేయాల్సిన ఇతర ప్రాజక్టులు ఆలస్యం కావడంతో, హరీశ్ తో చేయాల్సిన చిత్రం కూడా ఆలస్యం అవుతుందని అంటున్నారు. ఈలోగా తాజాగా వచ్చిన ఈ రీమేక్ ను హరీశ్ పూర్తి చేయొచ్చని సమచారం.