HomeTelugu Big Storiesసాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

Health bulletin on sai dhar

మెగా మేనులుడు సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ‘సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఈ రోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం’ అని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రేపు మరో బులెటిన్‌ విడుదల చేస్తామని తెలిపారు.

సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. బైక్‌తో ఆయన కింద పడిపోవడాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను పోలీసులు నటుడు సాయిధరమ్‌ తేజ్‌గా గుర్తించి మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌‌, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ హుటాహుటిన ఆస్పత్రి దగ్గరికి వచ్చి.. సాయిధరమ్‌ తేజ్‌ పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు సినీ దర్శకుడు త్రివిక్రమ్‌, అల్లు అరవింద్‌, సందీప్‌ కిషన్‌ తదితరులు ఆసుపత్రికి తరలివచ్చారు.

Health bulletin1

ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్‌ తేజ్‌ క్రమంగా కోలుకుంటున్నారని సినీ నిర్మాత అల్లు అరవింద్‌ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో సాయితేజ్‌కు స్వల్పంగా గాయాలయ్యాయని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని మెగాస్టార్‌ చిరంజీవి వెల్లడించారు. ప్రమాద ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu