HomeTelugu Trendingమల్టీస్టారర్‌తో సిద్దార్థ్‌ రీ ఎంట్రీ!

మల్టీస్టారర్‌తో సిద్దార్థ్‌ రీ ఎంట్రీ!

9 26

హీరో సిద్దార్థ్ తెలుగులో నేరుగా సినిమాలు చేసి చాలా కాలం అయింది. అడపాదడపా డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను పలకరించారు. ఇక ఆ మధ్యన తెలుగులో మంచి సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తానని చెప్పాడు సిద్ధార్థ్‌. ఇన్నాళ్లకు తెలుగు సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఆర్‌ఎక్స్ 100 సినిమా తో యువతను ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి. త్వరలో ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే రవితేజ శర్వానంద్‌ని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వాళ్ళ ఈసినిమా నుంచి రవితేజ తప్పుకున్నారు. ఇక అదే సమయంలో ఈ సినిమా స్టోరీ సిద్దార్థ్ కి చెప్పడంతో ఓకే చేసారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు ‘మహా సముద్రం’ అని టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారట చిత్రయూనిట్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu