HomeTelugu Trendingచంద్రుడిపై ప్లాట్‌ కొన్న తొలి బాలీవుడ్‌ హీరో సుశాంత్‌..

చంద్రుడిపై ప్లాట్‌ కొన్న తొలి బాలీవుడ్‌ హీరో సుశాంత్‌..

2 14

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అందరినీ కలిచివేస్తుంది.. ఇప్పటికే సుశాంత్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో.. హత్యగా కూడా అనుమానాలు లేకపోలేదు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు కూడా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే సుశాంత్ ఆస్తుల విలువ కూడా అంచనా వేస్తున్నారు. ఆయనకి ఎన్ని ఆస్తులు, ఎక్కడెక్కడ వున్నాయి అనే చర్చ జరుగుతోంది. సుశాంత్ కేవలం నటుడు మాత్రమే కాదు. టీవీ హోస్ట్, ఇంకా మంచి డాన్సర్. ఈయన ఒక సినిమాకు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు తీసుకునేవాడు. ఇక ప్రకటనల్లో నటించడానికి రూ.కోటి వరకు తీసుకునేవాడు. ఇలా సినిమాలు, యాడ్స్‌ ద్వారా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ రంగం సహా పలు చోట్ల పెట్టుబడిగా పెట్టాడట సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.

సుశాంత్ సింగ్‌ గ్యారేజ్ లో చాలా కార్లు, బైకులు కూడా ఉన్నాయి. ల్యాండ్ రోవర్, మాసెరటి క్వార్టర్‌పోర్ట్, బీఎండబ్ల్యూ లాంటి కార్లతో పాటు.. మంచి స్పోర్ట్స్ బైక్ లు ఆయన సొంతం. బాలీవుడ్‌కు రాకముందు చాలా టీవీ షోలతో పాటు.. బాలీవుడ్ లో సినిమాల్లోనూ సుశాంత్‌ సింగ్‌ బాగానే సంపాదించాడు. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.60 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా.. సుశాంత్‌కు అంతరిక్షం అంటే ఎంతో ఇష్టం. అందుకోసం ఏకంగా చంద్రుడిపైనే ప్లాట్‌ కొనుగోలు చేశాడు. అలా చేసిన తొలి బాలీవుడ్ హీరో ఇతనే. అంటే, సీ ఆఫ్ మాస్కోవీలో సుశాంత్‌కు ప్లాట్ ఉంది. 14ఎల్ఎక్స్00 అనే పవర్‌ఫుల్ టెలీస్కోప్‌తో ప్లాట్‌ను చూసి.. ఇంటర్నేషనల్ లూనర్ ల్యాండ్స్ రిజిస్ట్రీ ద్వారా ఈ ల్యాండ్ సొంతం చేసుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. అలాంటి వ్యక్తి మృతికి ఆర్థిక ఇబ్బందులు కారణమా? అంటు చర్చలు కూడా జరుగుతున్నాయి. నేడు సుశాంత్‌ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గనున్నాయి.

2a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu