HomeTelugu Trending'దొరసాని' పై విజయ్‌ దేవరకొండ కామెంట్స్‌

‘దొరసాని’ పై విజయ్‌ దేవరకొండ కామెంట్స్‌

7 11

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంలో తన సోదరుడు ఆనంద్‌ నటన చాలా నచ్చిందని అన్నారు. ఈ సినిమాతో ఆనంద్‌, నటుడు రాజశేఖర్‌-జీవితాల కుమార్తె శివాత్మిక అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఆనంద్‌, శివాత్మిక నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని ఉద్దేశించి విజయ్‌ శనివారం ట్వీట్లు చేశారు. ‘చిత్రంలోని యువ నటీనటుల పట్ల గర్వంగా ఉంది. ఐ లవ్‌ యూ సో మచ్‌ మై బాయ్‌ (ఆనంద్‌). కానీ నీకంటే నాకు రాజు (‘దొరసాని’లోని పాత్ర) బాగా నచ్చాడు (నవ్వుతున్న ఎమోజీ). శివాత్మిక నటన నన్ను కదిలించింది. ప్రతి నటి, నటుడిలోని సహజత్వం, కథను చూపించిన విధానం.. వెండితెరపై సినిమాను ఎంతో అందంగా మార్చాయి’.

‘కేవీఆర్‌ మహేంద్ర, ప్రశాంత్‌ విహారి, సన్నీ కూరపాటి ఎంతో అద్భుతమైన పనితీరు కనబరిచారు. మన మార్గాలు త్వరలోనే కలుస్తాయని కచ్చితంగా చెబుతున్నా. మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. ఈ చిత్రం ప్రతి సినీ ప్రేమికుడికి చేరువ కావాలని ఆశిస్తున్నా’ అని విజయ్‌ పేర్కొన్నారు.

‘దొరసాని’ని ఉద్దేశించి రాజశేఖర్‌ కూడా ట్వీట్‌ చేశారు. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఓ ఆణిముత్యంలాంటి సినిమా తీశారని అన్నారు. ‘నా బంగారం శివాత్మిక పట్ల చాలా గర్వంగా ఉంది. ఆనంద్‌ దేవరకొండ, మహేంద్ర, మొత్తం చిత్ర బృందంలో చాలా ప్రతిభ ఉంది. మీ అందరికీ గొప్ప భవిష్యత్తు ఉంది’ అని ట్వీట్‌ చేశారు.

7a 3

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!