‘ఎన్నమో ఏదోస చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగుపెట్టిన నటి నికిషాపటేల్. ఆ తర్వాత ‘నారదన్’, ‘భాస్కర్ ఒరు రాస్కెల్’, ‘ఆయిరం జన్మంగల్’ చిత్రాల్లో నటించింది. ఇంకా తమిళం, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాలు చేస్తోంది. తాజాగా ఆరవ్కు జోడీగా ‘మార్కెట్రాజా ఎంబీబీఎస్’లో నటిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఓ పాటను కూడా తెరకెక్కించారు. ఓ లిప్లాక్ సన్నివేశాన్ని దర్శకుడు ఇటీవల వివరిస్తే ఆరంభంలో నికిషాపటేల్ నిరాకరించింది. ఆ తర్వాత ఆ సన్నివేశం ప్రాముఖ్యత గురించి దర్శకుడు చెప్పడంతో వెంటనే అంగీకారం తెలిసింది. ఆ మేరకు సన్నివేశంలో నటించింది కూడా. దీని గురించి నికిషా స్పందిస్తూ… ‘ సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశం అది. అందువల్లే అంగీకరించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ సన్నివేశాన్ని చూసేటప్పుడు ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా ఉండదు. సినిమాలపై ఉన్న ఆసక్తితోనే ఇక్కడి వచ్ఛా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునేంత వరకు ప్రయత్నిస్తుంటా. తప్పకుండా ఏదో ఒక రోజు నేను అనుకునే గుర్తింపు వస్తుందని’ పేర్కొన్నారు.