గోవా బ్యూటీ ఇలియానా అంటే సన్నని నడుము, అందంగా ఉన్న అమ్మాయి అంటే ఇలియానాలా ఉందని ఉదాహరణగా చెప్పేవారు. దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇలియానా ఆ తర్వాత వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ల లిస్ట్లో చేరింది. కొన్నాళ్లు సినిమాకు దూరంగా ఉన్న ఇలియానా లావుగా అయిపోయింది. కొంత గ్యాప్ తర్వాత రవితేజ పక్కన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించిన ఇలియానా తన అభిమానులను నిరాశపరిచింది. ఆమె బాడీలోని మార్పులు చూసి తట్టుకోలేకపోయారు. సడన్గా తాను బరువు పెరిగిపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో ఇలియానా వెల్లడించింది.
దేవుడి చేసిన మనుషులు సినిమా తరువాత ఇలియానా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సన్నగా ఉన్న తన ఫిగర్ను చూసి ఎవరైనా కామెంట్ చేస్తారేమోనని చాలా బాధపడేదట. అదే సమయంలో ఓసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలని కూడా అనుకుందట. ఈ నేపథ్యంలో ఆమె ట్రీట్మెంట్ తీసుకుందట. ఆ సమయంలో రోజుకు 12 ట్యాబ్లెట్స్ వేసుకుని నిద్రపోయేదట. అందుకే తన శరీరంలో మార్పులు వచ్చి బరువు పెరిగిపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత ఆ బరువు తగ్గించుకోవడానికి జిమ్కు వెళ్లేదాన్నని, ఆ సమయంలో మీడియా చాలా ఫొటోలు తీసిందని తెలిపింది. ఆ ఫొటోలు బయటికి రావడంతో తనను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేశారని బాధపడిందట.
ప్రస్తుతం ఇలియానా మళ్లీ సన్నబడి సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్టింగ్లు చూసి అభిమానులు మళ్లీ ఎగబడుతున్నారు. బీచ్లో బికినీల్లో తన అందాలతో మళ్లీ కుర్రకారును రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తోందీ భామ. తన బాయ్ఫ్రెండ్ ఆండ్రూతో విడిపోయాక ఇప్పుడు పూర్తిగా సినిమాలపై దృష్టిపెడుతోంది. ప్రస్తుతం హిందీలో పాగల్ పంతి సినిమాలో నటిస్తోంది. త్వరలో ఓ సినిమా కూడా చేయబోతుందట.