HomeTelugu Trendingఎన్టీఆర్ 'మిస్సైల్‌'.!

ఎన్టీఆర్ ‘మిస్సైల్‌’.!

6 10
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బీజీగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టాడు ఎన్టీఆర్‌. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలిస్తోంది మూవీయూనిట్‌. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కెజియఫ్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతునున్నారు. ప్రశాంత్ నీల్‌ ‘కెజియఫ్‌’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కాగాఎన్టీఆర్‌,ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లోని సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ కథను సిద్ధం చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌కు కథ చెప్పి కూడా ఓకే చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాకు రేడియేషన్ అనే టైటిల్‌తో మిస్సైల్‌ పేరుతో పాటు ‘పవర్ హౌస్’ అనే టైటిల్స్ అనుకుంటున్నారు. చిత్ర యూనిట్ మాత్రం ‘మిస్సైల్‌’ టైటిల్ పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ న్యూక్లియర్ ప్లాంట్స్‌తో పాటు పర్యావరణ నేపథ్యంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. మొత్తానికి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu