HomeTelugu Trendingరష్మిక ఇంటి పత్రాలు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు

రష్మిక ఇంటి పత్రాలు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు

7 14

కర్ణాటకలోని కొడుగు జిల్లాలో హీరోయిన్ రష్మిక ఇంట్లో ఆదాయపు పన్ను అధికారులు నిన్న సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సరైన లెక్కలు లేని రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ విభాగం వెల్లడించింది. వీటితోపాటు విరాజ్‌పేట ప్రాంతంలో ఉన్న రష్మిక ఇంటి కాగితాలను వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఐటీ సోదాల సమయంలో రష్మిక ఇంట్లో లేరు. షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులను అధికారులు ప్రశ్నించారు.

రష్మిక ఆస్తులకు సంబంధించి ఆమె తల్లిదండ్రులు సరైన సమాధానం చెప్పలేకపోవడంతో అధికారులు ఆమె ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రష్మిక బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నారు. హీరోయిన్ రష్మికకు సంబంధించి లావాదేవీలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని ప్రస్తుతం ఆమె తండ్రికి సంబంధించిన లావాదేవీలపై విచారణ జరుగుతోందని రష్మిక మేనేజర్ వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu