HomeTelugu Big Storiesసెప్టెంబర్ 3న పాటలు, 10న ట్రైలర్!

సెప్టెంబర్ 3న పాటలు, 10న ట్రైలర్!

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం ‘జై లవ కుశ’ . యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రానికి ఇప్పటికే మార్కెట్ లో విశేషమైన ఆకర్షణ ఉన్న సంగతి తెలిసినదే. “జై”, “లవ కుమార్” టీజర్ ల కు సోషల్ మీడియా లో రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి.

ఈ చిత్రం ఆడియో ను సెప్టెంబర్ 3 న డైరెక్ట్ గా మార్కెట్ లో కి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తొలుత భారీ స్థాయి లో ఆడియో ఫంక్షన్ ను ప్లాన్ చేసినప్పటికీ, భారీ వర్ష సూచన తో పాటు, వినాయక నిమ్మజ్జనం లో పోలీస్ శాఖ నిమగ్నమై ఉండటం తో, అభిమానుల భద్రత కి ప్రాధాన్యం ఇస్తూ, డైరెక్ట్ గా మార్కెట్ లో కి విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

సెప్టెంబర్ 10 న, హైదరాబాద్ లో అభిమానుల మధ్య, “జై లవ కుశ” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, ” సోదరుడు ఎన్టీఆర్ తో , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై “జై లవ కుశ” చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందం గా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో, అత్యుత్తమ సాంకేతిక విలువలతోనిర్మించాం. అభిమానుల భద్రత కి ప్రాధాన్యం ఇస్తూ , ఆడియో ని డైరెక్ట్ గా మార్కెట్ లో కి విడుదల చేస్తున్నాం. కానీ ట్రైలర్ ను మాత్రం అభిమానుల నడుమ సెప్టెంబర్ 10 న హైదరాబాద్ లో విడుదల చేస్తాం ” అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu