HomeTelugu Trendingఆత్రుతగా ఎదురు చూస్తున్నా: జాన్వీ కపూర్‌

ఆత్రుతగా ఎదురు చూస్తున్నా: జాన్వీ కపూర్‌

9 22
అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌.. కార్గిల్‌ గర్ల్‌ గుంజన్‌ సక్సేనా జీవిత కథతో.. టైటిల్‌ రోల్‌పోషిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా జాన్వీ ఇన్‌స్టా వేదికగా సినిమాకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

”ఈ అనుభూతికి క్యాప్షన్‌ పెట్టేందుకు రెండు రోజులు ఆలోచించాం. కానీ, కుదరలేదు. షూటింగ్‌ పూర్తయింది. ఒక అద్భుతమైన ప్రయాణంలో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది. అంతేకాదు, శరణ్‌ శర్మలాంటి ఒక మంచి స్నేహితుడిని పొందా. దీని గురించి చెప్పంటే.. ఇదొక స్వచ్ఛమైన, నిజాయతీ, సాహసోపేతమైన, మర్చిపోలేని అనుభూతి. మీతో చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నా” అని జాన్వీ కపూర్‌ చెప్పుకొచ్చింది.

శరణ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీతో పాటు, పంకజ్‌ త్రిపాఠి, అంగద్‌ బేడీ తదితరులు నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాలు నిర్మిస్తున్నారు. వచ్చే మార్చి 13న 2020న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu