HomeTelugu Trendingలోహితని తొలిసారి వరంగల్ ఎన్‌.ఐ.టి. లో కలిశాను: కార్తికేయ

లోహితని తొలిసారి వరంగల్ ఎన్‌.ఐ.టి. లో కలిశాను: కార్తికేయ

Karthikeya about her fiance
హీరో కార్తికేయ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఆయన నిశ్చితార్థం వైభవంగా సాగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా ఆయన పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి గురించి కార్తికేయ స్పందించాడు. ఆమె పేరు లోహిత. వరంగల్‌ ఎన్‌.ఐ.టి.లో చదువుతున్నప్పుడు (2010) ఇద్దరికీ పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు ఏడడుగుల బంధం కాబోతుంది. ‘నా స్నేహితురాలే భార్యగా నా జీవితంలోకి వస్తుందనే విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2010 నుంచి మాకు పరిచయం ఉంది. లోహితని తొలిసారి వరంగల్ ఎన్‌.ఐ.టి. లో కలిశాను’ అని కార్తికేయ తన మనసులో మాట పంచుకున్నారు. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu