HomeTelugu Trendingకత్రినా-విక్కీలను.. చంపుతానంటూ బెదిరింపులు.. కేసు నమోదు

కత్రినా-విక్కీలను.. చంపుతానంటూ బెదిరింపులు.. కేసు నమోదు

Katrina Vicky Kaushal got d

ప్రముఖ బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లకు సోషల్‌ మీడియా ద్వారా బెదిరింపులు వ‌చ్చాయి. చంపుతానంటూ.. ఓ వ్యక్తి హెచ్చరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పేరిట ముంబై పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై విక్కీ కౌశల్ శాంతాక్రజ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమను బెదిరిస్తున్నట్టు, బెదిరింపు ఇమేజ్ లను పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయన తన ఫిర్యాదులో వివరించాడు. సదరు వ్యక్తి క్రతినా కైఫ్ ను వెంబడిస్తున్నట్టు పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 9న రాజ‌స్ధాన్‌లో అట్ట‌హాసంగా జ‌రిగిన పెండ్లి వేడుక‌లో ఒక్క‌టైన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu