మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది నటి కీర్తి సురేష్. ఆ సినిమా తర్వాత అవకాశాలు ఈ భామను వెతుక్కుంటూ వస్తున్నాయి. వరుస అవకాశాలు అందుకుంటూ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే లాక్డౌన్ కారణంగా అన్ని సినిమా థియేటర్లు మూసేయడంతో కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘పెంగ్విన్’ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. మరో సినిమా ‘మిస్ ఇండియా’ కూడా ఓటీటీ విడుదలకు రెడీగా ఉంది. తాజాగా ‘గుడ్ లక్ సఖి’ అనే సినిమాలోనూ నటించింది కీర్తి సురేష్. ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల కానుంది అని సమాచారం. వీటితో పాటు నితిన్ రంగ్ దే సినిమాలో నటిస్తుంది. త్వరలో ఈ బ్యూటీ తన ఫ్యాన్స్కు సర్ ఫ్రైజ్ ఇవ్వనుందని తెలుస్తుంది. త్వరలో కీర్తి నిర్మాతగా మారనున్నట్లు సమాచారం. తమిళ లో ఓ వెబ్సిరీస్ను నిర్మించేందుకు కీర్తిసురేశ్ సన్నాహాలు చేస్తున్నట్టు వినికిడి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.