HomeTelugu Big Storiesమీటూ పై కియారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు

మీటూ పై కియారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు

11 8
మీటూ ఉద్యమం దేశంలో ఎలాంటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. మీటూ కారణంగా ఇండస్ట్రీలో చాలామంది దర్శక నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీటు తరువాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. ఇండస్ట్రీలో మహిళలను గౌరవిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, మీటు పై బాలీవుడ్ నటి కియారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

మీటూ తరువాత పరిస్థితుల్లో మార్పులు వస్తాయని అనుకున్నారు. కానీ, మార్పులు రాలేదని, వస్తాయని కూడా అనుకోవడం లేదని ఆమె పేర్కొంది. మనం ఇంకా మీటూ తర్వాతి దశకు చేరుకోలేదని వ్యాఖ్యానించింది. మీటూ ఫలితం ఇంకా రాలేదని వ్యాఖ్యానించింది ఈ బ్యూటీ. కియారా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మీటూ వలన ఇండస్ట్రీకి మంచి జరిగిందని కాజోల్ వంటి సీనియర్ నటి కొన్నాళ్ల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కియారా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu