HomeTelugu Trendingకరోనాతో కోలీవుడ్‌ హాస్యనటుడు మృతి

కరోనాతో కోలీవుడ్‌ హాస్యనటుడు మృతి

Kollywood comedian pandu di

కోలీవుడ్ నటుడు, ప్రముఖ కమెడియన్‌ పాండు(74) కరోనాతో మృతి చెందారు. గత కొన్ని రోజుల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అతను 1970 లో మానవన్ తో నటుడిగా అరంగేట్రం చేశాడు. దీనిలో అతను విద్యార్థి పాత్రను పోషించాడు. ఈయ‌న శివాజీ గణేశన్, ఎంజీఆర్, కమలహాసన్, రజనీకాంత్‌ వంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.

పాండుకు భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా, పాండు భార్య కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమం​ ఉన్నట్లు తెలుస్తోంది. పాండు మృతి పట్ట కోలీవుడ్‌ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పాండు తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత చిత్రాలపై ఆసక్తిని పెంచుకున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu