ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఆయితే ఆదివారం పరిస్థితి విషమించడంతో కృష్ణంరాజు తుది శ్వాస విడిచారు. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ …కృష్ణంరాజు దహన సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు దహన సంస్కారాలు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం నుంచి మొయినా బాద్ లోని కనకమామిడి ఫామ్ హౌస్ వరకు కృష్ణంరాజు పార్ధీవ దేహనికి అంతిమ యాత్రని నిర్వహించారు.
సోమవారం ఉదయమే కనకమామిడి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లని పూర్తి చేశారు. దీంతో అభిమాన నటుడు కృష్ణంరాజు పార్ధీవ దేహాన్ని చూసేందుకు సెలబ్రిటీలు రాజకీయ నేతలు అభిమానులు పెద్ద సంక్షలో అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జకగకుండా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు.