టాలీవుడ్లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి. వరుస సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ప్రస్తుతం తెలుగులో దాదాపు నాలుగు సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి తనకు జీవిత భాగస్వామిగా రాబోయే వ్యక్తి ఎలా ఉండాలో చెప్పేసింది. తనకు అబద్ధం చెప్పే అబ్బాయిలంటే అస్సలు నచ్చరని, నిజాయితీగా ఉండాలని, ఏదైనా తన ముఖం మీదే చెప్పే ధైర్యం ఉండాలని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి నాని ‘శ్యామ్ సింగ రాయ్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే చిత్రాల్లో నటిస్తోంది.