HomeTelugu Trendingబాలకృష్ణ అఖండ సీక్వెల్స్‌.. నిర్మాత అతనేనా?

బాలకృష్ణ అఖండ సీక్వెల్స్‌.. నిర్మాత అతనేనా?

Who is the real producer of

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్‌ ఉంటుంది అని గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎటువంటి అప్డేట్‌ ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తమ బ్యానర్ లో దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు అందరూ అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా అల్లు అర్జున్ తో కాదు, నందమూరి బాలకృష్ణతో అఖండ పార్ట్ 2 అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

అన్ స్టాపబుల్ షోతో అల్లు అరవింద్‌కు బాలకృష్ణకు మధ్య స్నేహం ఏర్పడింది. ఈ స్నేహ బంధంతోనే బోయపాటి, బాలకృష్ణ సినిమాను అల్లు అరవింద్ తమ నిర్మాణ సంస్థలో చెయ్యాలని అనుకుంటున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లితో చేస్తున్న మూవీ తర్వాత ఉండొచ్చని అని కూడా అంటున్నారు.

అయితే మరి ఈ సినిమాకు నిర్మాత ఎవరనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. వాస్తవానికి అఖండ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించాలనుకుంటే ఆయనే మళ్లీ నిర్మాతగా వ్యవహరించాలి. ఇంకా ఎవరైనా అఖండ-2 ప్రొడక్షన్‌లోకి ప్రవేశించాల్సి వచ్చినా.. వారు రవీందర్ రెడ్డితోపాటు నిర్మాణ భాగస్వామి అవుతారు.

మరోవైపు, బాలయ్య అఖండ-2ను 14 రీల్స్ బ్యానర్ నిర్మిస్తుందని ఆ మధ్య మరికొన్ని వార్తలు వచ్చాయి. కానీ 14 రీల్స్ బ్యానర్, బోయపాటి శ్రీనివాస్.. బాలయ్యతో పొలిటికల్‌ మూవీ తీయాలి అనుకున్నారు. ఈ క్రమంలో కేవలం పూకార్లే అని తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu