HomeTelugu Big Storiesపొలిటీషియన్స్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మాధవీలత

పొలిటీషియన్స్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మాధవీలత

8 10కాంట్రవర్సీ బ్యూటీ మాధవీలత తెలుగులో సినిమాలు చేసింది తక్కువే అయినా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాల్లో పెద్దగా కలిసి రాకపోవడంతో రాజకీయాల వైపు మళ్లిన బింధు మాధవి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాంట్రవర్సీలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే మాధవీలత తాజాగా మరో బాంబు పేల్చింది. గత కొంతకాలంగా బీజేపీలో మరో మహిళా నేత సాధినేని యామినితో బింధుమాధవికి కోల్డ్‌వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సాధినేని యామిని తొందరలోనే బీజేపీ పెద్దల అభిమానం సంపాదించి ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవి దక్కించుకుంది. అయితే అప్పట్లోనే సాధినేని యామినిపై బింధుమాధవి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మల్లెపూలు నలిపే కథలు చెప్పి క్రేజ్ తెచ్చుకున్న వారికి పార్టీలో గుర్తింపు ఇవ్వడం సరికాదంటూ అప్పట్లో కాంట్రవర్సీకి తెరలేపింది. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ మొదలైంది.

బీజేపీ నాయకురాలు సాధినేని యామినిని తాజాగా వారణాశి కాశీ దేవస్థాన బోర్డ్‌లో దక్షిణాది తరపున అధికార ప్రతినిధిగా నియమించిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించాడు ఓ నెటిజన్. ఇన్నాళ్లుగా బీజేపీ ఉన్న మాధవీలతను గుర్తించకుండా.. తన తర్వాత టీడీపీ నుంచి బీజేపీకి వచ్చిన సాధినేని యామినికి పదవి కట్టబెట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు నెటిజన్. ఇది చూసిన మాధవీలత వెంటనే స్పందిస్తూ మనదేశంలో పదవులు రావాలంటే టాలెంట్ అక్కర్లేదని, గొప్ప వాళ్లతో పరిచయాలు, రికమండేషన్స్ ఉంటే చాలంటూ పొలిటీషియన్స్ అందరికీ దిమ్మతిరిగేలా కౌంటరిచ్చింది. రాజకీయాల్లో మాత్రమే కాదు.. ఎక్కడైనా రికమండేషన్స్ ఉంటాయని, తనను రికమండ్ చేసే గొప్పవాళ్లు ఎవ్వరూ లేరని, తనకు ఉన్నది కేవలం అభిమానులే కామెంట్స్ చేసింది.

8a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu