టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తున్నాడు. పరశురామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను, ‘సంక్రాంతి’కి విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. ఇది మూడో సినిమా కావడంతో, అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
త్రివిక్రమ్ సినిమా తరువాత అనిల్ రావిపూడితో మహేష్ బాబు సినిమా ఉండనున్నట్టు చెబుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ తరువాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో అనిల్ రావిపూడి .. మహేష్ బాబును క్రికెట్ కోచ్ గా చూపించనున్నాడని అంటున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథే అయినా, అనిల్ రావిపూడి మార్క్ వినోదమే ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో విలన్, హీరోయిన్లు ఎవరు? అనే విషయాలు త్వరలో తెలియనున్నాయి. అయితే, మహేష్ తో రష్మిక మరోసారి జోడీకట్టే అవకాశం లేకపోలేదని అంటున్నారు.