HomeTelugu Newsకొత్త వ్యాపారం చేయనున్న మహేష్‌!

కొత్త వ్యాపారం చేయనున్న మహేష్‌!

1 14

టాలీవుడ్‌ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌వైపు సినిమాల్లో బీజీగా ఉంటునే మరోవైపు వ్యాపారా రంగంలోను దుసుకుపోతున్నారు. ఇప్ప‌టికే ఏఎంబీ సినిమాస్‌, హంబుల్ డ్ర‌సెస్‌తో పాటు జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప‌లు సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఆయ‌న మ‌రో కొత్త బిజినెస్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది. మహేష్ బాబు తాజాగా డిజిటల్ ప్లాట్ ఫామ్ వ్యాపారంలోకి కూడా దిగబోతున్నారని వినికిడి. ఇప్పటికే నిర్మాత అల్లు అరవింద్ ‘ఆహా’ పేరుతో డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో మహేష్‌ కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త‌లో ఎంత నిజ‌ముందనే విష‌యంపై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది. ఇటీవ‌ల స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హేష్ బాబు త్వ‌ర‌లో ప‌ర‌శురాం డైరెక్షన్‌లో ఓ మూవీ చేయ‌నున్నాడు. కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం ఆగిపోయింది లేదంటే ఇప్పటికే స్టార్‌ అయ్యేది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న ప్రారంభమయ్యే అవకాశలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu