HomeTelugu News‘సరిలేరు నీకెవ్వరు’ హీరోయిన్‌ ఫిక్స్‌..

‘సరిలేరు నీకెవ్వరు’ హీరోయిన్‌ ఫిక్స్‌..

11 14సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తాజాగా పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పరుశురామ్ ఈ సినిమాను ఇప్పటి వరకు టాలీవుడ్‌లో రానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో విలన్‌గా కోసం బాలీవుడ్‌ నటుడు సుదీప్‌ పేర్లును పరిశీలిస్తున్నారు.

అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు జంటగా కీర్తి సురేష్‌ను తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే కీర్తి సురేష్ ఈ కథ నచ్చి ఓకే చెప్పిందట. డిసెంబర్ నుంచి ‘సర్కారు వారి పాట’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అప్పటికే కీర్తి సురేష్ తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ఈ సినిమాకు డేట్లు కేటాయించనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

11a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu