HomeTelugu Trendingమహేష్‌, వంశీ పైడిపల్లి సినిమా మరింత ఆలస్యం!

మహేష్‌, వంశీ పైడిపల్లి సినిమా మరింత ఆలస్యం!

5 22

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తాజా నటించిన చిత్రం ‘సరిలేరునీకెవ్వరు’. ఈ సినిమాతో విజయాన్ని అందుకున్న మహేశ్‌ త్వరలో వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించనున్నారనే విషయం తెలిసిందే. షూటింగ్‌ల నుంచి కొంత విరామం తీసుకున్న మహేశ్‌ ప్రస్తుతం తన కుటుంబసభ్యులతో కలిసి విదేశాల్లో సరదాగా గడుపుతున్నారు. టూర్‌ అనంతరం ఆయన వంశీ పైడిపల్లి సినిమా పనుల్లో పాల్గొననున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌ సినిమా కొంత ఆలస్యమయ్యేలా ఉందని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. మహేశ్‌ కోసం గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో సాగే ఓ కథను వంశీ రాశారట.. అయితే ఈ కథ మహేశ్‌కు అంతగా నచ్చలేదని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వంశీ కథలోని విలన్‌ పాత్ర కూడా మహేశ్‌కు అంతగా నచ్చలేదట. దీంతో స్ర్కిప్ట్‌పై మరోసారి వర్క్‌ చేయమని వంశీకి మహేశ్‌ సూచించారట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu