HomeTelugu Trendingనువ్వు లేకుండా తొలి పండుగా.. హీరో భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

నువ్వు లేకుండా తొలి పండుగా.. హీరో భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

6 15
కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం మొతం వణికిపోతుంది. ఈ వైరస్‌ నియంత్రించేందుకు ప్రపంచం మొత్తం లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రస్తుతం దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ లో ఉన్నాయి. దీంతో రవాణాతో పాటు పలు వ్యవస్థలు నిలిచిపోయాయి. కాగా షూటింగ్ కోసం జోర్దాన్ ఎడారి వెళ్లిన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ అలాగే చిత్ర యూనిట్ అక్కడే చిక్కుకుంది. విమానాలు నిలిచిపోవడం తో దిక్కుతోచని స్థితిలో అక్కడే ఉండిపోయారు. అయితే ఈ విషయం పై పృథ్వీరాజ్ భార్య ఓ ఎమోషనల్ పోస్ట్ చేసారు. అందులో… మలయాళి తొలి పండుగా విషును మిస్ అవుతున్నాను. మన పెళ్లి తరువాత మొదటిసారి నువ్వు లేకుండా ఈ పండుగను జరుపుకుంటున్నాను అని తెలిపింది. గత సంవత్సరం మనం కలిసి ఈ పండుగను జరుపుకున్నాం. ఆ సంతోషం ఈ ఒక ఏడాది లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక గత ఏడాది జరుపుకున్న ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. ఈ ఏడాది పండుగకు మన ఇద్దరి మధ్య వేల మైళ్ల దూరం ఉందని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu