HomeTelugu Trendingఅనాథల కోసం ఆదిపురుష్ టిక్కెట్లు కొన్న మంచుమనోజ్

అనాథల కోసం ఆదిపురుష్ టిక్కెట్లు కొన్న మంచుమనోజ్

Manchu Manoj and mounika

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం వినూత్న ఆలోచన చేసింది. ఈ సినిమా ప్రదర్శితం అయ్యే ప్రతీ షోలో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచాలని, కొన్ని టికెట్లను రామాలయాలకు, పేద చిన్నారులకు ఇవ్వాలని నిర్ణయించింది.

దీనికి బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పేద పిల్లల కోసం 10వేల టికెట్లను బుక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా 10 వేల టికెట్లు బుక్ చేసి పేదలకు పంచుతామని చెప్పారు. బాలీవుడ్ సింగర్ అనన్య బిర్లా కూడా 10 వేల టికెట్లు బుక్ చేసుకున్నారు.

శ్రేయాస్ మీడియా సైతం ఖమ్మం జిల్లాలోని 1103 గ్రామాలలో ఒక్కో రామాలయానికి 101 టికెట్లు బుక్ చేస్తున్నట్లు తెలిపింది. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా చేరారు. ఏపీ, తెలంగాణలోని అనాథ పిల్లలకోసం 2500 టికెట్లను బుక్ చేసి ఆదిపురుష్ సినిమా చూపించబోతున్నట్టు మంచు మనోజ్–మౌనిక దంపతులు ప్రకటించారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu