ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు శుభవార్త. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. గ్రూప్-1,2,3, డీఎస్సీ, పోలీసు శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ ఉదయం అసెంబ్లీలోని తన ఛాంబర్లో చంద్రబాబు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏయే శాఖల్లో ఖాళీలు ఉన్నాయనేదానిపై అధికారులతో సమీక్షించారు. 20,010 ఖాళీల భర్తీకి ఈ సమావేశంలో సీఎం ఆమోదం తెలిపారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఈ నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నియామకాల ప్రక్రియను త్వరిత గతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో దీనిపై సీఎం చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది.