HomeTelugu Trendingచిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేసిన పొన్నాంబ‌ళం

చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేసిన పొన్నాంబ‌ళం

Megastar Chiranjeevi helped
టాలీవుడ్‌ స్టార్‌ మెగాస్టార్‌ చిరంజీవి మ‌రోసారి తన మంచి మనస్సుని చాటుకున్నారు. నటుడు పొన్నాంబ‌ళం స‌మ‌స్య‌ల్లో ఉన్నార‌ని తెలుసుకుని చేయూతనిచ్చారు. పొన్నాంబ‌ళం కొన్నాళ్లుగా మూత్రపిండాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. కిడ్నీ మార్పిడి కోసం రూ.రెండు ల‌క్ష‌లు పొన్నాంబ‌ళం బ్యాంకు ఖాతాకి డబ్బులు పంపారు చిరంజీవి. త‌న‌కు స‌హాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియ‌జేశారు పొన్నాంబ‌ళం. ‘నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్‌ కోసం రెండులక్షల రూపాయలు పంపినందుకు ధ‌న్య‌వాదాలు. మీ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను’ అని అన్నారు. ఈ మేర‌కు సోషల్‌ మీడియా వేదిక‌గా ఓ వీడియోను షేర్‌ చేశారు. చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన ఘ‌రానా మొగుడు, ముగ్గురు మొన‌గాళ్లు త‌దిత‌ర చిత్రాల్లో విలన్‌గానటించాడు పొన్నాంబ‌ళం. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. చెన్నైలో నివాసం ఉంటోన్న పొన్నాంబ‌ళం ప్ర‌స్తుతం అక్క‌డే చికిత్స పొందుతున్నారు. ఇక సీనియ‌ర్ న‌టి పావ‌లా శ్యామ‌ల‌కీ ఇటీవ‌ల‌ చిరంజీవి ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే.

ఆక్సిజన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయానున్న చిరంజీవి

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!