HomeTelugu Newsవరుణ్ తేజ్ డేట్ ఫిక్స్ చేశాడు!

వరుణ్ తేజ్ డేట్ ఫిక్స్ చేశాడు!

వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్ట‌ర్‌`. రెండు పాట‌లు మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తైంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా…
ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ – “మిస్ట‌ర్ సినిమా ఏప్రిల్ 14న విడుద‌ల‌కానుంది. రెండు పాట‌లు మిన‌హా సినిమా షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రీ రికార్డింగ్ ఫినిషింగ్ ద‌శ‌లో ఉంది. డైరెక్ట‌ర్‌గా `మిస్ట‌ర్‌` వంటి క‌థ‌ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే మంచి ఎమోష‌న్స్‌కి, హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైనింగ్‌కి, మ్యూజిక్‌కి, విజువ‌ల్స్‌కు స్కోప్ ఉన్న క‌థ‌. ఇప్పుడు రెండు పాటలు మిన‌హా సినిమా పూర్త‌య్యింది. అవుట్‌పుట్‌తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎలాంటి కాంప్ర‌మైజ్ లేకుండా తీయ‌గ‌లిగాను. అందుకు నా నిర్మాత‌ల‌కు, న‌టీన‌టుల‌కు, టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్. అంద‌రూ సినిమాకు ప్రాణం పెట్టి ప‌నిచేశారు. ట్రావెల్ ఫిలింలా ఉంటుంది. దాని కోసం స్పెయిన్‌లోని ప‌లు అద్భుత‌మైన లొకేష‌న్ల‌లో షూట్ చేశాం. అలాగే ఇండియాలో చిక్ మంగ‌ళూర్‌, చాళ‌కుడి, ఊటీ, హైద‌రాబాద్ ఏరియాల్లో ఒరిజిన‌ల్ లొకేష‌న్స్‌లో షూట్ చేశాం. మిక్కి జె.మేయ‌ర్‌తో ఫ‌స్ట్ టైం ప‌నిచేశాను. ఇందులో ఆరు పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉన్నాయి. నిన్న‌నే ఫ‌స్ట్ హాప్ రీరికార్డింగ్‌తో చూశాను. ఇన్ని వేరియేష‌న్స్ ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లొ చూపించ‌డం క‌ష్టం. మిక్కి అన్ బిలివ‌బుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు“ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu