HomeTelugu Trendingమహేష్‌, నమ్రతల ఫొటో తీసిన సితార.. వైరల్‌

మహేష్‌, నమ్రతల ఫొటో తీసిన సితార.. వైరల్‌

Mahesh And Namratha Adorablసూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సతీమణి నమ్రత ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఎప్పటికప్పడు మహేష్‌, తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆమె సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఆమె మహేశ్‌తో దిగిన ఓ అపురూప చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

”మన ఉనికికి మూలకారణం ప్రేమే అని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రేమ మాత్రమే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ వల్ల వచ్చే భావోద్వేగం నుంచి ఉత్పన్నమవుతాయి. ఇది నా అవగాహన. అందరూ ప్రేమగా, ఒకరికొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఇవే నా నిజమైన సంతోషానికి కారణం” అని తెలిపారు. ఈ అపురూపమైన ఫొటోని సితార తీసిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా ప్రస్తుతం మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu