HomeTelugu Trending'సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌'లో మహేశ్‌బాబు సతీమణి

‘సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌’లో మహేశ్‌బాబు సతీమణి

4 19
సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ తాజాగా ‘సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌’లో పాల్గొన్నారు. ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కట్టడికి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ‘సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌’ పేరుతో పలు వీడియోలను చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. 20 నుంచి 40 సెకన్లపాటు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చూపిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా ఈ ‘సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌’లో నటి నమ్రతా పాల్గొన్నారు. ‘సరైన పద్ధతిలో 20 నుంచి 40 సెకన్లపాటు చేతులను శుభ్రం చేసుకుంటే చేతుల్లో ఉండే క్రిములు నశిస్తాయి. దీంతో కరోనాను నియంత్రించొచ్చు. అందరూ కలిసి కరోనా కట్టడికి పాటుపడదాం.’ అని నమ్రత పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu