నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆమె 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆమె కొడుకు హార్ష వివాహం ఆదివారం ఘనంగా జరిగింది.
హైదరాబాద్ గచ్చిబౌళిలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుక జరిగింది. మేనమామలు తారక్, కళ్యాణ్రామ్లు హర్ష పెళ్లిని దగ్గరుండి జరిపించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.
ఇక వివాహ వేడుకల్లో ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లే హైలేట్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ మరియు ఆయన కుమారుడు మోక్షజ్ఞ తేజ కూడా పెళ్లిలో సందడి చేశారు.