HomeTelugu Trendingనాగశౌర్యతో ఓ బేబీ డైరెక్టర్‌

నాగశౌర్యతో ఓ బేబీ డైరెక్టర్‌

3 16
దర్శకురాలు నందినీ రెడ్డి .. తెరకెక్కించిన ‘ఓ బేబీ’ చిత్రం ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ కథతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన ఆమె, ఈ సారి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకుంది.

వైజయంతీ మూవీస్ కి అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం హీరోగా నాగశౌర్యను తీసుకున్నారు. హీరోయిన్‌ని ఎంపిక చెయ్యాల్సి వుంది. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకి, లక్ష్మీ భూపాల్ సంభాషణలను అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu