సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘మహర్షి’ విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. దీంతో యూనిట్ సభ్యులు భారీ ఎత్తున వేడుక నిర్వహహించాలని నిర్ణయించారు. ఈనెల 28న శిల్పకళా వేదికలో వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేచ్యురల్ స్థార్ నానిని ఆహ్వానించారట. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుతో మంచి సన్నిహిత్యం ఉండటం వలనే నాని ఈ వేడుకకు హాజరవుతున్నాడట. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు స్టార్ హీరోలే ముఖ్య అతిథులుగా హాజరయ్యేవారు. కానీ మహేష్ కొత్తగా మీడియం రేంజ్ హీరోలను కూడా ఆహ్వానిస్తూ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు.