టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఇటీవల వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమా తరువాత ఒకటి రెండు కాంబినేషన్లతో ఆయన పేరు వినిపించినప్పటికీ, అవి కార్యరూపాన్ని దాల్చలేదు. తాజాగా ఆయన ఒక కొత్త డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తో సినిమా చేయడానికి అంగీకరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అప్పుడు మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి నవీన్ కాస్త లేట్ చేసినా పెద్ద బ్యానర్లోనే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రానా దగ్గుబాటి కాంబినేషన్లో ‘భీమ్లా నాయక్’ అనే మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తుంది.
ANNOUNCEMENT. Excited to bring you this film with the dynamic @vamsi84 garu @SitharaEnts & super excited to have Trivikram Garu’s @Fortune4Cinemas on board as well 😊 Nenu eppudu cheptanu idi mana journey ani. As always need your love and support. We will give it everything ❤️ https://t.co/pBK5PiuP62
— Naveen Polishetty (@NaveenPolishety) September 15, 2021