హీరోయిన్ అనుష్క, మాధవన్, అంజలి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘నిశ్శబ్దం’ ట్రైలర్ను శుక్రవారం నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ”ఇదిగోండి ‘నిశ్శబ్దం’ ట్రైలర్. మన స్వీటెస్ట్ స్వీటీ నటించిన థ్రిల్లర్ మిమ్మల్ని ఉత్కంఠతో సీటు చివరిన కూర్చోబెడుతుంది. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు.
ఇందులో అనుష్క బదిర యువతిగా నటించింది. ట్రైలర్ను చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్గా చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘భాగమతి’ తర్వాత అనుష్క కీలక పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
పెయింటింగ్ కళాకారిగా కనిపిస్తుంటే, హీరో మాధవన్ మ్యూజిక్ కళాకారుడిగా నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి ఓ కీలక పాత్ర చేస్తున్నది. ఈ మూవీ ఏప్రిల్ 2 వ తేదీన థియేటర్లలో సందడి చేయబోతున్నది. కొద్దిసేపటి క్రితమే రిలీజైన నిశ్శబ్దం ట్రైలర్ నిశ్శబ్దంగా భయపెడుతున్నది. మరి సినిమా కూడా అదే విధంగా ఉంటుందా చూడాలి.